ప్రేమకి బీద, గొప్ప తేడా ఉండదు. కానీ, పెళ్ళికి మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. అదే ఇప్పుడు వీరి పాలిట శత్రువు అయింది.
తమిళనాడులోని కోయంబత్తూరులో ఉన్న మానియాకరంపాళయంకి చెందిన విఘ్నేశ్వరన్, స్నేహ అనే ఇద్దరూ ఒకరినొకరు గాడంగా ప్రేమించుకున్నారు. పెళ్ళికూడా చేసుకుందాం అనుకున్నారు. కానీ, వీరిద్దరూ వేర్వేరు కులాలకి చెందినవారు కావటంతో అమ్మాయి తరఫు వాళ్ళు ఒప్పుకోలేదు. దీంతో వారిద్దరూ కొద్దిరోజుల క్రితం ఇంట్లో నుంచి పారిపోయి పెళ్లి చేసుకున్నారు.
అయితే, స్నేహ తండ్రి కాస్త డబ్బున్నవాడు కావటంతో కన్న కూతురి కంటే… పరువే ముఖ్యం అని భావించాడు. అందుకే వీరిని కిడ్నాప్ చేయటానికి రౌడీలని పంపించాడు.
ఇక ఈ జంట తమకి కొత్తగా పెళ్లయినందున గుడికి వెళ్లి వస్తున్నారు. ఇంతలో కోయంబత్తూరులోని లక్ష్మీ మిల్స్ సిగ్నల్ దగ్గరకి రాగానే కారులో వచ్చిన కొందరు వ్యక్తులు ఈ జంటని కిడ్నాప్ చేసి… బలవంతంగా తమ కారులోకి ఎక్కించుకొన్నారు. కారులోనే వారిని భయపెట్టటం, కొట్టటం, కత్తితో బెదిరించటం వంటివి చేశారు.
దీంతో భయపడిపోయిన ఆ జంట… “మమ్మల్ని కిడ్నాప్ చేశారు. మమ్మల్ని విడదీయాలని చూస్తున్నారు. దయచేసి మమ్మల్ని రక్షించండి! ” అంటూ అందరికీ వినపడేలా గట్టిగా అరుస్తున్నారు. అసలే ఆ సమయంలో ట్రాఫిక్ ఎక్కువగా ఉండటంతో… అసలు విషయం తెలుసుకున్న ప్రజలు ట్రాఫిక్ పోలీసులకి సమాచారం అందించారు. వెంటనే పోలీసులు వారిని తమ కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నారు