Robbers Loot Rs 1 Crore

పట్టపగలే దొంగల బీభత్సం (వీడియో)

ఇటీవలికాలంలో దొంగల బీభత్సం ఎక్కువైపోయింది. ఏ క్షణాన ఎలా విరుచుకు పడతారో అస్సలు అర్ధం కావట్లేదు. తాజాగా ముంబై నగరంలో కొందరు దుండగులు ఒక కార్యాలయంలో చొరబడి… అక్కడి ఉద్యోగులకి పాయింట్ బ్లాక్‌లో గన్ను పెట్టి రూ. కోటి రూపాయిలు దోచుకెళ్లారు. ఇదంతా అక్కడి  సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. 

ముంబైలోని ములుంద్ ప్రాంతంలో ఉన్న ఓ ఆఫీస్ లోకి  ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు వచ్చారు. వాళ్ళు వస్తూనే… ముఖానికి మాస్క్… చేతిలో గన్నులతో…  లోపలి వచ్చారు. లోపల ఉన్నవారందిరినీ పాయింట్ బ్లాక్ లో గన్ను పెట్టి బెదరిస్తూ…  కోటి రూపాయల నగదు తీసుకొని పారిపోయారు. 

ఇదంతా అక్కడి సీసీటీవీ ఫుటేజీలో స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top